WHO పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన
NEWS May 24,2026 11:23 am
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. కాంగో, ఉగాండ, దక్షిణ సూడాన్లలో వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా బుండిబుగ్యో ఎబోలాపై అప్రమత్తమైంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు ప్రయాణించవద్దని హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. ఇప్పటికే కాంగోలో మొత్తం 936 మందికి ఈ వ్యాధి వ్యాపించగా.. 214 మరణాలు నమోదయ్యాయి.