మెట్ పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామానికి చెందిన తోగిటి శ్యాం కుమార్ డీఎస్సీ ఫలితాలలో స్కూల్ అసిస్టెంట్ హిందీ సబ్జెక్టులో జగిత్యాల జిల్లాలో మొదటి ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు. ప్రస్తుతం ఆయన మేడిపల్లి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో హిందీ పండితునిగా పనిచేస్తున్నారు.