హైడ్రా విషయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కి కొన్ని సూచనలు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలను హైడ్రా పేరుతో భయభ్రాంతులకు గురి చేయవద్దని చెప్పారు. తన నియోజకవర్గంలో ఏలాంటి కూల్చివేతలు లేకుండా చూడాలని, హైడ్రా అధికారులు అత్యుత్సాహం చూపించవద్దన్నారు.