తెలంగాణ ప్రజలపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ రోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణప్రజలను పొగడ్తలతో ముంచెత్తారు. అనుకున్న లక్ష్యం కంటే మొక్కలను అధిక సంఖ్యలో నాటి, సరికొత్త రికార్డు సాధించారని తెలిపారు. నేటితో మన్ కీ బాత్ పదేళ్లు పూర్తి చేసుకుంది. సహకరించిన వారికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.