కోరుట్ల పట్టణంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలలో ముఖ్యఅతిథిగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాల్గొని బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ బాపూజీ స్వాతంత్ర పోరాటం, తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమాలలో పోరాడిన మహనీయుడని వారి ఆశయాల సాధనలో భాగంగా ప్రతి ఒక్కరు వారంలో ఒకసారి చేనేత వస్త్రాలను ధరించి చేనేత రంగానికి తోడ్పాటు అందించాలని కోరారు.