మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హీసేవ ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మెట్ పల్లిలోని చిన్న చెరువు (వట్టివాగు) వద్ద మున్సిపల్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటిన కమిషనర్, స్వచ్ఛతాహి సేవా ద్వారా ప్రజలను భాగస్వాములు చేసి చిన్న చెరువు( వట్టివాగు) వద్ద పిచ్చి మొక్కలను చెత్తాచెదరంను తొలగించి శుభ్రపరచి మొక్కలు నాటినట్టు తెలిపారు. నేషనల్ హైవే పైన నాటిన మొక్కలను కటింగ్ చేస్తూ సర్వ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.