కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇది నెల 28వ తేదీన నిర్వహించే చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు కోరారు. సంగారెడ్డి లోని సుందరయ్య భవన్ లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని కోరారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.