పోతిరెడ్డిపల్లి: సంగారెడ్డి మున్సిపాలిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద శుక్రవారం స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డుపై వెళ్లే వాహనదారులకు స్వచ్ఛతపై వివరించారు. రోడ్ల పైన చెత్త వేయవద్దని ఇంటికి వచ్చే వాహనంలోనే వేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.