సీఎం రేవంత్ రెడ్డిని మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిశారు. తెలంగాణ వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షల చెక్ ను సీఎంకు అందజేశారు. AMB సినిమాస్ తరపున మరో రూ. 10 లక్షలను అందించారు. వరద బాధితులకు అండగా నిలిచి విరాళం అందించిన మహేశ్ కు ఈ సందర్భంగా సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు.