తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసి.. ఐజీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీసిన జగన్.. ఇప్పుడు ప్రధాని మోడీకి లేఖ రాయడం, వైసీపీ నేతల ప్రకటనలు చూస్తుంటే కడుపు రగిలిపోతోందన్నారు. రివర్స్ టెండర్ల పేరుతో ప్రసాదాల నాణ్యత దెబ్బతీసిన జగన్ను ఏం చేయాలో ప్రజలే నిర్ణయించాలని చంద్రబాబు అన్నారు.