ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ
చేసిన జిల్లా అదనపు కలెక్టర్
NEWS Sep 21,2024 04:02 pm
గుమ్మడిదల మండల కేంద్రంలో శనివారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. రోగులకు మరిన్ని సేవలను అందించేందుకు త్వరలోనే 100 పడకల ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తామన్నారు. అనంతరం అధికారులతో సమావేశమై పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు పాల్గొన్నారు.