కేజీబీవీ ఉద్యోగాలకు కౌన్సెలింగ్
NEWS Sep 21,2024 08:43 am
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో కేజీబీవీ ఉద్యోగాల కోసం కౌన్సిలింగ్ శనివారం నిర్వహించారు. ఉద్యోగాలకు ఎంపికైన 52 మందికి వచ్చినప్పుడు కలెక్టర్ చంద్రశేఖర్ పోస్టింగ్ ఉత్తర్వులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఎంపికైన వారు విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని చెప్పారు. కార్యక్రమంలో డిఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.