పాఠశాలను సందర్శించిన కలెక్టర్
NEWS Sep 20,2024 06:15 pm
పాఠశాలల్లో ఆయా సబ్జెక్టులలోని పాఠ్యాంశాలపై విద్యార్థులతో నిత్యం సాధన చేయించాలని ఉపాద్యాయులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్డిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అక్కపల్లిలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయాల ఆవరణ ,టీచర్లు, సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. కట్టెల పొయ్యిపై ఆహార పదార్థాలను తయారు చేయవద్దని నిర్వాహకులకు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, తహసిల్దార్ రాంచంద్రం పాల్గొన్నారు.