ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
NEWS Jun 13,2026 03:07 pm
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నెల్లిపాక బంజర కిష్టారం గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.