సినిమా చూపిస్తూ..
కాకినాడ జీజీహెచ్లో ఆపరేషన్
NEWS Sep 18,2024 09:58 am
కాకినాడ జీజీహెచ్లో తొండంగి మండలానికి చెందిన అనంతలక్ష్మి (55)కి మంగళవారం అదుర్స్ సినిమా చూపిస్తూ మొదటి సారిగా అరుదైన ఆపరేషన్ చేసినట్లు యాజమాన్యం తెలిపింది. మత్తు ఎక్కువ ఇవ్వకుండా సినిమా చూపిస్తూ మెదడులో కణతి తొలగించామన్నారు. ఆమె 15 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర విభాగానికి రాగా.. మెదడులో కణతి ఉందని గుర్తించారు. అవేక్ క్రేనియటోమీ అనే అధునాతన పద్ధతిలో ఆపరేషన్ చేసినట్లు తెలిపారు.