ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు జిల్లాఎస్పీ అఖిల్ మహాజన్. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలుగు సాహితీ రంగానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు మరువలేనివని, తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దార్శనీకుడు కాళోజీనారాయణ రావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.