దర్శకుడు జవ్వాజి సతీష్కు సన్మానం
NEWS Mar 14,2026 05:12 pm
ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన ‘బ్యాండ్ మేళం’ సినిమా దర్శకుడు జవ్వాజి సతీష్ను మెట్పల్లి బీజేపీ నేత బద్దం గంగాధర్ సన్మానించారు. ఈ నెల 26న విడుదల కానున్న ఈ చిత్రం భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. దర్శకుడు సతీష్ మాట్లాడుతూ తనను మాత్రమే కాకుండా తాను తెరకెక్కించిన సినిమాను కూడా వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు మగ్గిడి వెంకట నర్సయ్య, పుప్పాల భాను మూర్తి, తోగిటి రాజశేఖర్, కటకం వేణుగోపాల్, పసునూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.