హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నిర్మాత అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి అల్లు శిరీష్ దంపతులను ఆశీర్వదించారు. ఇటీవల అల్లు శిరీష్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఇటీవల వివాహం చేసుకున్న ఆయన కుమారుడు సూర్య విక్రమాదిత్య-సాక్షి దంపతులకు తన ఆశీస్సులు అందించారు. పలు ప్రభుత్వ కార్యక్రమాల వల్ల వీరి వివాహానికి హాజరు కాలేకపోయిన చంద్రబాబు.. ఇవాళ ఇరువురి ఇంటికి వెళ్లి.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.