హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్గా మహేశ్ కుమార్ నియామకం అయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. మహేశ్ 2023లో పీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా. పీసీసీ అధ్యక్ష పదవికి మధుయాష్కీ గౌడ్ పోటీ పడ్డారు. కానీ చివరకు రేవంత్కు అత్యంత సన్నిహితుడైన మహేశ్ను పీసీసీ పీఠం వరించింది.