ఎంపీని కలిసిన పోలీస్ అధికారులు
NEWS Sep 05,2024 04:47 pm
హిందూపురం పట్టణ కేంద్రంలోని ఆర్అండ్ బీ అతిథి గృహంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారధిని పట్టణ డిఎస్పీ, సీఐ, ఎస్సైలు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.