పురుగు మందు తాగి బాలుడు మృతి చెందిన ఘటన పెంబి మండలంలో జరిగింది.పెంబి మండలంలోని ఎంగ్లాపూర్ కు చెందిన చిన్నరెడ్డి(11) కడెంలోని ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఇటీవలే అనారోగ్యం కారణంగా ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు చికిత్స చేయించారు. తిరిగి పాఠశాలకు వెళ్లమని చెప్పడంతో గత నెల 30న పురుగుమందు తాగాడు. నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు పెంబి ఎస్ఐ శంకర్ తెలిపారు.