వరద నష్టం వివరాలివ్వాలి
NEWS Sep 04,2024 04:40 pm
తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో సంభవించిన ఆస్తి, ప్రాణ, పంట నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బృందాలను క్షేత్రస్థాయిలోకి వెంటనే పంపించాలని సూచించారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ప్రతీ జిల్లాలో విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులు, పరికరాల వివరాలు వెంటనే సమర్పించాలని సూచించారు.