బాధితులకు బాలయ్య భారీ విరాళం
NEWS Sep 03,2024 03:06 pm
తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని బాలకృష్ణ ప్రకటించారు. ఏపీ సీఎం సహాయనిధికి రూ. 50 లక్షలు, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 50 లక్షలు అందిస్తున్నానని తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో బాధాతప్త హృదయంతో ఈ సాయాన్ని అందిస్తున్నానని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.