ఎల్లంపల్లికి పెరుగుతున్న వరద
NEWS Sep 02,2024 12:49 pm
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. శనివారం నుండి వరద ఉధృతి తీవ్రంగా పెరుగుతున్న విషయాన్ని గమనించిన ఇరిగేషన్ అధికారులు గేట్లు ఎత్తాలని నిర్ణయించారు. కడెం ప్రాజెక్టుతో పాటు క్యాచ్ మెంట్ ఏరియాల నుండి వస్తున్న వరద నీరును అంచనా వేసిన అధికారులు
ఆదివారం గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి వదిలారు. 5గేట్ల నీటిని వదలగా,నీటిని 16గేట్ల ద్వారా నీటిని గోదావరిదిగువ ప్రాంతానికి వదులుతున్నారు.అలాగే ఎల్లంపల్లి బ్యారేజీ మీదుగా వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నామని ఈఈ స్వామి తెలిపారు