ఉత్తర ఇరాక్లోని ఎర్బిల్ నగరంలో శనివారం రాత్రి డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. లానాజ్ ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఆకాశమంత ఎత్తున దట్టమైన నల్లటి పొగ అలుముకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో రిఫైనరీలో చమురు ఉత్పత్తిని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.