TPCC చీఫ్గా మహేశ్కుమార్ గౌడ్?
NEWS Sep 01,2024 04:34 am
TG: టీ-పీసీసీ చీఫ్గా ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ను నియమిస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన నియామకానికి ఆమోదం తెలుపుతూ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సంతకం కూడా చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఏ క్షణమైనా అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఇదే గౌడ్ సామాజికవర్గం నుంచి ఈ పదవికి మధుయాష్కీ గౌడ్ పోటీపడినా మహేశ్ వైపే అగ్ర నేత సోనియా గాంధీ మొగ్గు చూపినట్లు సమాచారం.