అంజన్నను దర్శించుకున్న వైస్ చాన్సలర్
NEWS Sep 01,2024 05:02 am
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్నను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టీ.కిషన్ రావు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి, స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి, రామకృష్ణారావు, సహాయ కార్యనిర్వాహణాధికారి అంజయ్య,ఆలయ పర్యవేక్షకులు హరిహర నాథ్, ఆలయ స్థానాచార్యులు కపిందర్ ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.