భారీగా అక్రమ మద్యం స్వాధీనం
NEWS Aug 30,2024 05:01 am
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలోని శారదానగర్కు చెందిన గాజుల ఆనంద్ అనే వ్యక్తి అక్రమంగా నిల్వ ఉంచిన అమ్ముతున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఆనంద్ అక్రమంగా మద్యం అమ్ముతున్నాడన్న సమాచారం మేరకు సిబ్బందితో అక్కడికి వెళ్లి 182 మద్యం బాటిళ్లు, 12 బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆనందపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు.