ఖానాపూర్ పట్టణంలోని దేవునిగూడ గ్రామానికి చెందిన 180 మంది కార్మికులకు కార్మిక బీమా పాలసీలను జిల్లా కేంద్రంలోని తిరుమల నర్సింగ్ హోమ్ ప్రముఖ వైద్యులు డాక్టర్ రమేష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మారుమూల గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. బీమా పాలసీలు నిరుపేద కుటుంబాలకు ఆపద సమయంలో ఎంతో అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రతి కార్మికుడు తప్పనిసరిగా బీమా పాలసీ చేయించుకోవాలని సూచించారు.