భారత్ డోజో యాత్ర పేరుతో ఇంకో యాత్రను ప్రారంభించనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇచ్చే కేంద్రాలను డోజో అని పిలుస్తారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా.. మార్షల్ ఆర్ట్స్ వీడియోను కాంగ్రెస్ రిలీజ్ చేసింది. జోడో యాత్ర సమయంలో తాము వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు తెలిపారు. ఆ సమయంలో తమ శిబిరాల వద్ద బ్రెజిల్ మార్షల్ ఆర్ట్స్ను ప్రాక్టీస్ చేసేవాళ్లమని తెలిపారు. ఫిట్గా ఉండేందుకు తాము ప్రారంభించిన ఈ మార్షల్ ఆర్ట్స్ కొన్ని రోజుల్లోనే అందరికీ చేరువైందన్నారు.