బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. రాగంపేటకి చెందిన 17 ఏళ్ల బాలిక ఈనెల 24వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆ సమయంలో కనకాంబరం రంగు టాప్, నలుపు రంగు లెగ్గిన్ ధరించింది. బాలిక ఆచూకీ తెలిసినవారు త్రీటౌన్ పోలీసులకు తెలియజేయాలని కోరారు.