కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి
NEWS Aug 27,2024 10:27 am
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 699 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోగా 1548 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు మీడియాకు వెల్లడించారు.