తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
NEWS May 30,2026 06:45 pm
కర్నూలు: తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. మంత్రాలయం వద్ద గల్లంతైన వారిని ఉరవకొండకు చెందిన సంధ్య(22).. హైదరాబాద్కు చెందిన యువన్ చంద్ర(5), సతీశ్(35).. మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర(25), ధను(23)గా గుర్తించారు. వీరంతా బంధువుల ఇంట్లో సత్యనారాయణ వ్రతం కోసం వచ్చారు. వ్రతం తర్వాత నదిలోకి దిగి.. లోతు అంచనా వేయలేక గల్లంతయ్యారు. వీరి కోసం పోలీసులు, మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు.