మూడు రోజులు పాడేరులో అరకు ఎంపీ
NEWS Aug 27,2024 06:25 am
అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మా తనూజారాణి నేటి నుంచి పాడేరులో ప్రజలకు అందుబాటులో ఉంటారని క్యాంప్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల జరిగిన భారత పార్లమెంట్ సమావేశాలు ముగించుకుని తిరుగు ప్రయాణమై వచ్చారు. పాడేరులోని తమ నివాస కార్యాలయంలో మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.