టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కుట్ర
NEWS Jun 01,2025 06:11 pm
తిరుమల ప్రతిష్టను దిగజార్చేందుకు వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి. గోశాలలో గోవులు మరణించాయంటూ అసత్య ప్రచారాలు చేశారంటూ ఆరోపించారు. ఓ ముస్లిం వ్యక్తిని నమాజ్ చేసుకోమని చెప్పి మళ్ళీ వాళ్లే వీడియో తీసి అసత్య ప్రచారానికి తెర లేపారంటూ మండిపడ్డారు. నిన్న క్యూలైన్ లో సరైన ఏర్పాట్లు లేవు, భక్తులను సరిగ్గా చూసుకోవడం లేదని ఆరోపణలు చేయించారని పేర్కొన్నారు. ఈ ఘటనను కుట్ర కోణంలో విచారించాలని డీజీపీకి లేఖ రాశానని చెప్పారు.