అన్నవరంలో అమ్మవారి ఆలయంలో వెండి కవచం దొంగతనం
NEWS Aug 26,2024 02:36 am
అన్నవరం గ్రామంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో కొలువు తీరిన మరిడమ్మ అమ్మవారి ఆలయంలో వెండి కవచం దొంగతనానికి గురైంది. దీనిపై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ కిషోర్ ఆదివారం తెలిపారు. సుమారు కిలో బరువు కలిగిన వెండి కవచం చోరీకి గురైనట్లు ఆలయ నిర్వహకులు ఫిర్యాదు చేశారన్నారు. ఆలయం వద్ద ఉన్న సీసీ కెమెరాలు, ఇన్వర్టర్ కూడా పనిచేయలేదని తెలిపారన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.