4న జనసేన ఆధ్వర్యంలో వేడుకలు
NEWS Jun 01,2025 06:41 pm
ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. కూటమి విజయానికి ఏడాది పూర్తవుతున్న తరుణంలో ఈ నెల 4వ తేదీన జనసేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. సంక్రాంతి - దీపావళి కలిపి చేసుకుందామన్నారు. సుపరిపాలనకు ఏడాది పేరుతో మహిళలు రంగవల్లులు వేయాలన్నారు. దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చి పండగ చేసుకుందామన్నారు. ఫోటోలు తీసి సోషల్ మీడియాను షేక్ చేయాలన్నారు.