రాజమహేంద్రవరంలో ఒక రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. అది గమనించిన బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి వెంటనే తన వాహనాన్ని నిలిపి ఎస్కార్ట్ వాహనంలో క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. ఆస్పత్రికి ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.