గోపాలపురం నుంచి ముమ్మిడివరప్పాడు వెళ్లే రోడ్డు అధ్వానం
NEWS Aug 25,2024 08:15 am
రావులపాలెం మండలంలోని గోపాలపురం నుంచి ముమ్మిడివరప్పాడు గ్రామం వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. ఏళ్ల తరబడి రహదారి సమస్య గ్రామాలలో ఉన్నప్పటికీ పాలకులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి వెంబడి భారీగా ఏర్పడిన గుంతలలో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు రాకపోకలు సాగించడం మరింత నరకయాతనగా మారింది.