అడ్రస్ లేని విదేశాంగ శాఖ ఆఫీసులు
NEWS Aug 15,2024 10:24 am
సికింద్రాబాద్లో ఉన్న PIE, KPSK ఆఫీసుల అడ్రస్, నేమ్ బోర్డులు లేకపోవడం వలన గల్ఫ్ వలసదారులు, వారి కుటుంబ సభ్యులు అయోమయానికి గురవుతున్నారని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. బయట ఉండాల్సిన బోర్డులు ఆఫీసులో ఉన్నాయని, గల్ఫ్ బాధితులను గేటు వద్దనే అడ్డుకుంటున్నారని, వారి నిర్లక్ష్యంపై విదేశాంగ శాఖ ఉన్నతాధికారులకు Mail, X ద్వారా విజ్ఞప్తి చేశారు.