సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో TRS అధినేత్రి కవిత సమర శంఖం పూరించారు. పాంచ జన్య సంకల్ప సభలో కవిత ఓపెన్ గా మాట్లాడారు. నేను వాళ్ళు వదిలిన బాణం.. వీళ్ళు వదిన బాణం కాదు.. ఇప్పటికీ అధికారానికి.. విద్యకు దూరంగా ఉన్న మా బహుజనుల బాణాన్ని నేను. యువకుల యుద్ద నినాదాన్ని నేను. వారికోసం మోడీతో కొట్లాడుతా. రేవంత్ రెడ్డితో కొట్లాడుతా. చివరికి కేసీఆర్తో నైనా కొట్లాడుతా.. అంటూ కవిత చెప్పుకొచ్చారు.