పెట్రోల్ బంకుల్లో UPI సేవలకు బ్రేక్?
NEWS Sep 20,2026 11:54 am
₹2,000కు మించిన UPI లావాదేవీలపై 0.4% MRD విధించే ప్రతిపాదనపై పెట్రోల్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛార్జీల నుంచి ఇంధన విక్రయదారులకు మినహాయింపు ఇవ్వకపోతే అక్టోబర్ 15 నుంచి మధ్యప్రదేశ్, ముంబైలోని పెట్రోల్ బంకుల్లో UPI చెల్లింపులను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ముంబై RBI, కేంద్ర ఆర్థికశాఖకు లేఖ రాసింది. మధ్యప్రదేశ్లోని సుమారు 4,700 బంకులపై ప్రభావం పడుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఘజియాబాద్ వ్యాపారులు UPI చెల్లింపులు స్వీకరించబోమంటూ నోటీసులు ఏర్పాటు చేశారు.