వరంగల్ కాకతీయ యూనివర్సిటీ లోని అడ్మినిస్ట్రేషన్ భవనంలో న్యూ పీజీ హాస్టల్ విద్యార్థులతో సీఐ రవికుమార్, రిజిస్ట్రార్ రామచంద్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాన్ బోర్డర్ విద్యార్థులను యూనివర్సిటీలోకి అనుమతించబోమన్నారు. వారికి ఆశ్రయం కల్పించిన వారి అడ్మిషన్లు రద్దు చేస్తామని నాన్ బోర్డర్లు హాస్టల్ కాళీ చేయాలని సూచించారు. దాంతో పాటు యూనివర్సిటీలో విద్యార్థులు ఘర్షణలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు సత్ప్రవర్తనతో ముందుకు వెళ్లాలని సూచించారు.