పట్టణ పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
NEWS Sep 18,2026 03:43 pm
పట్టణ పేదల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సిద్ధమవుతోంది. జీ+8 నుంచి జీ+14 వరకు టవర్లను నిర్మించి, ఒక్కో ఫ్లాట్ను 430 చ.అ. విస్తీర్ణంలో నిర్మించాలని నిర్ణయించింది. పట్టణాల్లో ఉన్న స్థలాలను గుర్తించి ఇళ్లను నిర్మించనున్నారు. లిఫ్ట్, పార్కింగ్, షాపులు, అంగన్వాడీ కేంద్రాలు, బ్యాంకులు, కమర్షియల్ కాంప్లెక్స్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. ఒక్కో ఫ్లాట్ నిర్మాణ వ్యయం రూ.15.70 లక్షల నుంచి రూ.17.51 లక్షల వరకు ఉండనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.3.90 లక్షలు అందించగా, మిగతా మొత్తాన్ని లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే 24 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.