పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
NEWS Sep 17,2026 09:51 pm
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రతాపరెడ్డి కోరారు. కాకతీయ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. విసీ ప్రతాపరెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. మానవ మనుగడకు మొక్కలు ఎంతో అవసరమని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.