కేసీఆర్ ఫాంహౌస్ భూములపై ఎంక్వైరీ
సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు
NEWS Sep 16,2026 05:18 pm
700 ఎకరాలు కేసీఆర్ ఫామ్ హౌస్ ఆధీనంలో ఉందని, ఫామ్ హౌస్ భూమి కథేందో తేల్చాలని ఇప్పుడే కలెక్టర్ను ఆదేశిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఫామ్ హౌస్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని పేదలకు పంచుతానని సీఎం ప్రకటించారు. కేసీఆర్కు తక్షణమే నోటీసులు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు ఆదేశం ఇచ్చారు. 340 ఎకరాల ప్రభుత్వ భూమి కేసీఆర్ ఫాం హౌస్ పరిధిలో ఉందని చెప్పిన సీఎం, విచారణలో ప్రభుత్వ భూమి అని తేలితే ఆ భూమి పేదలకు పంచుతామని ప్రకటించారు.