జర్నలిస్ట్ పట్ల దురుసు ప్రవర్తన
సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
NEWS Sep 16,2026 04:22 pm
పత్తికొండ విశాలాంధ్ర రిపోర్టర్ ఎం. నాగరాజుపై అర్బన్ సీఐ జయన్న దురుసుగా ప్రవర్తించారంటూ జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐపై చర్యలు తీసుకోవాలని, ఐ న్యూస్ రిపోర్టర్లపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ ప్రతినిధులు పాల్గొన్నారు.