యూపీఐ ఛార్జీలపై కేంద్రం స్పష్టత
NEWS Sep 16,2026 02:40 pm
UPI లావాదేవీలపై ఛార్జీల విషయంలో వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే UPI చెల్లింపులపై ఎలాంటి రుసుము ఉండదు. రూ.2,000కు మించిన కొన్ని వ్యాపార లావాదేవీలకు మాత్రమే మర్చంట్ డిస్కౌంట్ రేట్ వర్తిస్తుంది. ఈ ఛార్జీలను వ్యాపారుల నుంచే బ్యాంకులు లేదా పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు వసూలు చేస్తారు. కస్టమర్లపై అదనపు భారం మోపకుండా చూడాలని కేంద్రం సూచించింది. బీమా, ఇంధనం, విద్యుత్, నీరు, గ్యాస్, విద్య వంటి నిర్దిష్ట చెల్లింపులకు ప్రత్యేకంగా రూ.5 ఫ్లాట్ MDR విధానం ఉంటుంది. అలాగే పెద్ద మొత్తాల అర్హత కలిగిన వ్యాపార లావాదేవీలకు గరిష్ఠ MDRను రూ.300గా పరిమితం చేశారు.