వినాయక చవితి శుభాకాంక్షలు: నీలం రమేష్
NEWS Sep 15,2026 12:11 am
కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర కామారెడ్డి జిల్లా ప్రజలకు ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ నీలం రమేష్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితిని ప్రజలంతా కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరారు. వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రజలు ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని నీలం రమేష్ సూచించారు. పండుగ సందర్భంగా భక్తులు, నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ సమష్టిగా సహకరించాలని ఆయన కోరారు.