రచయిత పూర్ణాచారికి సైమా అవార్డు
NEWS Sep 13,2026 10:04 pm
ములుగు జిల్లా బండారుపల్లి గ్రామానికి చెందిన గేయ రచయిత చల్లూరు పూర్ణాచారికి ప్రతిష్టాత్మక సైమా అవార్డు లభించింది. ఆయన రచించిన ‘కోర్టు’ సినిమాలోని ‘కథలెన్నో చెప్తారు’ పాటకు ఈ అవార్డు దక్కింది. గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగి సినీ రంగంలో తన ప్రతిభను చాటుకోవడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పూర్ణాచారికి అభినందనలు తెలిపారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ప్రతిభావంతుడు ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం ములుగు జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ అవార్డు పూర్ణాచారి సినీ ప్రయాణంలో మరో మైలురాయిగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.